స్మృతి ఇరానీ అనుచరుడి హత్య

స్మృతి ఇరానీ అనుచరుడి హత్య
x
Highlights

అమేథిలో బీజేపీ నేత స్మృతీ ఇరానీ అనుచరుడు సురేంద్ర సింగ్‌ హత్యకు గురయ్యాడు. దీంతో స్మృతీ ఇరానీ అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే కొందరు దుండగులు...

అమేథిలో బీజేపీ నేత స్మృతీ ఇరానీ అనుచరుడు సురేంద్ర సింగ్‌ హత్యకు గురయ్యాడు. దీంతో స్మృతీ ఇరానీ అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే కొందరు దుండగులు తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సురేంద్ర సింగ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై స్మృతీ ఇరానీ గెలుపొందిన వెంటనే ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షలు, రాజకీయ వివాదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories