అక్కడ ఆయన ఓడిపోతాడు, ఒక్కమంత్రి గెలవడు : పృథ్వీ

అక్కడ ఆయన ఓడిపోతాడు, ఒక్కమంత్రి గెలవడు : పృథ్వీ
x
Highlights

ఏపీలో ఎన్నికలు ముగిసి పట్టుమని ఆరురోజులు అవుతొంది. అప్పడే ఎన్నికల ఫలితాలపై పలువురు జోస్యం చెబుతున్నారు. ఇక బెట్టింగ్ రాయుళ్ల విషయానికి వోస్తే...

ఏపీలో ఎన్నికలు ముగిసి పట్టుమని ఆరురోజులు అవుతొంది. అప్పడే ఎన్నికల ఫలితాలపై పలువురు జోస్యం చెబుతున్నారు. ఇక బెట్టింగ్ రాయుళ్ల విషయానికి వోస్తే పదిరోజులు ఉపవాసం ఉన్న కుక్కకి మటన్ బొక్క దొరికొనట్లు ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఏపీ కింగ్? ఎవరని కొందరు బెట్టింగ్ కాస్తే ఇంకోందరు మాత్రం ఆయా నియోజకవర్గాలలో పోటీకి దిగిన ముఖ్యనేతలపై బెట్టింగ్ రాయుళ్లు గాలం వేసి కూర్చుకన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్రిముఖ పోరులో ఎవరి లెక్కల్లో వాళ్లు ఉన్నారు. ఏపీలో గెలుపు మాదంటే మాదేనని టీడీపీ, వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే త్రిముఖ పోరులో గెలుపు మాదే అంటున్నారు వైసీపీ నేత, కమెడియన్ పృథ్వీ. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ పృథ్వీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఒక్క మంత్రి కూడా గెలవడు అంటూ సవాల్ చేశారు. టీడీపీ పార్టీ నేతలు కేవలం ఓటమి భయంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నిజానికి ఈ ఎన్నికల్లో 130 సీట్లు వస్తాయి అన్నప్పుడు ఫేస్‌లో కళ ఏది. ముఖాలు మొత్తం మాడిపోయినట్టు ఉన్నాయన్నారు. అలాగే టీడీపీలో ఉన్న 18 మంది మినిష్టర్‌లలో ఎవరూ గెలివరు అని అన్నారు. అలాగే నారా చంద్రబాబునాయుడి కొడుకు నారా లోకేష్ మంగళగిరిలో ఘోరంగా ఓడిపోతున్నారు. లోకేశ్‌పై పోటీకి దిగిన ఆర్కే రియల్ హీరో. మాకు ఆయన కావాలని ప్రజలు అంటున్నారు. తాను మంగళగిరిలో ప్రచారం చేసినప్పుడు చాలా మందిని అడిగా మాకు ప్రభుత్వం అన్నీ ఇస్తుంది కాని ఓటు మాత్రం వైసీపీకి వేస్తాం అన్నారని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories