బుద్ధిమార్చుకోని పాక్.. తిక్కకుదిర్చిన భారత్..

బుద్ధిమార్చుకోని పాక్.. తిక్కకుదిర్చిన భారత్..
x
Highlights

ఎంత జరిగినా.. ఎన్నిసార్లు బుద్దిచెప్పినా పాక్‌ మళ్ళీ మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పాక్‌ మిలటరీకి చెందిన...

ఎంత జరిగినా.. ఎన్నిసార్లు బుద్దిచెప్పినా పాక్‌ మళ్ళీ మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పాక్‌ మిలటరీకి చెందిన డ్రోన్‌ ఒకటి భారత భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించింది. దీంతో దాన్ని తుపాకులతో పేల్చి వేసినట్టు బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాజస్తాన్‌లోని హిందుమాల్‌కోట్‌లోకి ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం పదింటికి అఖ్నూర్‌ సెక్టార్‌లో నంద్వాల్‌చౌక్‌ వద్ద రోడ్డు పక్కన ఉగ్రవాదులు అమర్చిన ఇంప్రోవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌(ఐఈడీ)ను సైన్యం గుర్తించింది.

వెంటనే ఆప్రాంతంలోని వారిని ఖాళీచేయించి ఐఈడీని నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో అలాంటివి ఇంకా ఏమైనా అమర్చారా అనే అనుమానంతో బలగాలు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories