ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా కేసీఆర్‌ దక్షిణాది టూర్

ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా కేసీఆర్‌ దక్షిణాది టూర్
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వస్తున్నవేళ టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దేశ రాజకీయాలపై దృష్టిపెట్టారు. కాంగ్రెస్‌,...

సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వస్తున్నవేళ టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దేశ రాజకీయాలపై దృష్టిపెట్టారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌‌ను ముందుకు తెచ్చిన కేసీఆర్‌ ఆ దిశగా మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్, కుమారస్వామి, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్‌ తదితరులను కలిసి చర్చలు జరిపిన కేసీఆర్‌ ఇప్పుడు కేరళ, తమిళనాడు టూర్‌ చేపట్టారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దక్షిణాది రాష్ట్రాల టూర్ చేపట్టారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యమంటోన్న కేసీఆర్‌, మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా రెండు దశలు మాత్రమే మిగిలి ఉండటంతో, ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను వేగవంతం చేశారు.

గతంలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌, బెంగాల్‌ ముఖ‌్యమంత్రి మమతాబెనర్జీ, కర్నాటక సీఎం కుమారస్వామిని కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించిన కేసీఆర్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌తోనూ సంప్రందింపులు జరిపారు. ఇప్పుడు మరోసారి ఫ్రంట్ రాజకీయాలను స్పీడప్ చేసిన కేసీఆర్ ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లి, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, సార్వత్రిక ఎన్నికల అనంతరం తలెత్తే రాజకీయ పరిణామాలపైనా చర్చించారు.

ఇదిలాఉంటే, కర్నాటక సీఎం కుమారస్వామి కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వీరిద్దరి మధ్య తాజా రాజకీయాలే చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక కేరళ టూర్ తర్వాత తమిళనాడు వెళ్లనున్న కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌‌తో సమావేశంకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories