వర్షం పడింది .. మెట్రో పంట పండింది ..

వర్షం పడింది .. మెట్రో పంట పండింది ..
x
Highlights

హైదరాబాద్ : రోజు రోజుకు మెట్రోకి ప్రజాదరణ పెరుగుతుంది .. దీనికి మొన్న మెట్రోలో ప్రయాణించిన సంఖ్యను చూస్తుంటే అర్ధం అయిపోతుంది .. మొన్న శుక్రవారం...

హైదరాబాద్ : రోజు రోజుకు మెట్రోకి ప్రజాదరణ పెరుగుతుంది .. దీనికి మొన్న మెట్రోలో ప్రయాణించిన సంఖ్యను చూస్తుంటే అర్ధం అయిపోతుంది .. మొన్న శుక్రవారం వర్షం కురవడంతో రోడ్ లు మొత్తం ట్రాఫిక్ జామయ్యాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ , మాదాపూర్ , దుర్గంచేరువు ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవడంతో చేసేది ఏమి లేకా అందరు మెట్రో లనే నమ్ముకున్నారు .. దీనితో మెట్రో కాసులు పంట పండింది .. గతంలో ఒక్కరోజే 2.89 లక్షల మంది ప్రయాణించినట్టు రికార్డు ఉండగా శుక్రవారం ఆ రికార్డును అధిగమించి 3.06 లక్షల మంది ప్రయాణించారు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకున్న మెట్రో అధికారులు కూడా నాగోల్ వరకు ప్రత్యేక రైళ్ళను నడిపించారు .. అంతే కాకుండా సమయం కూడా పొడిగించారు .. దీనితో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు సంఖ్యా గణనీయంగా పెరిగింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories