బ్యారేజ్‌లపై కాదు.. హైవేలపై కవాతు చేసుకోండి..

బ్యారేజ్‌లపై కాదు.. హైవేలపై కవాతు చేసుకోండి..
x
Highlights

సాగు, తాగునీరు అందించే బ్యారేజీలపై కవాతులు, బల ప్రదర్శనలు మానుకోవాలని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా జనసేన పార్టీకి సూచించారు. ప్రచారాలను...

సాగు, తాగునీరు అందించే బ్యారేజీలపై కవాతులు, బల ప్రదర్శనలు మానుకోవాలని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా జనసేన పార్టీకి సూచించారు. ప్రచారాలను జాతీయ రహదారులపై పెట్టుకుంటే మంచిదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని విమర్శిస్తున్న పార్టీలు క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్‌ పాదయాత్రలో ఉన్నా ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం నిర్వాసితులకు కేంద్రం నుంచి 27వేల కోట్లకు పైగా పరిహారం రావాల్సి ఉందని కేంద్రం ఆ సొమ్మును విడుదల చేస్తే తాము నిర్వాసితులకు ఇచ్చేస్తామని మంత్రి దేవినేని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories