ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

ఓటు హక్కు వినియోగించుకున్న  ప్రధాని మోడీ
x
Highlights

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని రణిప్ లో ఉన్న నిషాన్ హైస్కూల్ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. ఆ సమయంలో...

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని రణిప్ లో ఉన్న నిషాన్ హైస్కూల్ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. ఆ సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఆయన వెంట ఉన్నారు. ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ బూత్ లకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఓటు చాలా విలువైనదన్న ఆయన దేశ భవిష్యత్తును ఓటే నిర్ణయిస్తుందన్నారు. అంతకముందు గాంధీ నగర్ వెళ్లిన మోడీ తన తల్లి నివాసానికి చేరుకుని అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్ కు బయలుదేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories