బావిలో దూకిన చెల్లి...కాపాడేందుకు వెళ్లిన ఆన్నలు..

బావిలో దూకిన చెల్లి...కాపాడేందుకు వెళ్లిన ఆన్నలు..
x
Highlights

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అమరచింత మండలం కృష్ణంపల్లి నందిమల్ల ఎక్స్ రోడ్డు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు...

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అమరచింత మండలం కృష్ణంపల్లి నందిమల్ల ఎక్స్ రోడ్డు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలో దూకి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన జ్యోతి పదహారు, రమేష్ పందొమ్మిది, సంజీవ్ ఇరవై మూడు బావిలో దూకి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతి సెల్ఫోన్లో వేరొకరితొ మాట్లాడుతుండగా చిన్నన్న రమేష్ చూసి మందలించడంతో మనస్తాపానికి గురైన జ్యోతి ఇంటి పక్కనే గల బావిలో కిదూకింది కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు బావి దగ్గరికి వెళ్లి చూడగా బావి గడ్డపై అమ్మాయి చున్నీ కనిపించడంతో ఇద్దరు అన్నయ్యలు రమేష్ సంజీవులు జ్యోతిని కాపాడడానికి బావిలోకి దూకడంతో వారికి కూడా ఈత సరిగా రాకపోవడంతో ముగ్గురు మరణించడం జరిగింది .సెల్ఫోన్ తెచ్చిన చిచ్చు ఒక కుటుంబంలో విషాదాన్ని నెలకొల్పింది. పోలీసులు వచ్చి విచారణ ప్రారంభించి దర్యాప్తు చేస్తున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories