తెలంగాణలోకి మావోయిస్టు యాక్షన్‌ టీమ్స్‌

x
Highlights

త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణలోకి మావోయిస్టుల యాక్షన్‌ టీమ్స్‌ ప్రవేశించాయని పోలీసులు తెలిపారు. నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని...

త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణలోకి మావోయిస్టుల యాక్షన్‌ టీమ్స్‌ ప్రవేశించాయని పోలీసులు తెలిపారు. నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని తెలిపారు. దీనికి సంబంధించి మావోల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లో యాక్షన్‌ టీమ్‌ కదలికలు ఉన్నాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించే ముందు తమకు సమాచారం అందించాలని నాయకులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్‌ నాయకులకు అదనపు భద్రత కల్పిస్తున్నట్లు పోలీుసలు తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు వివరించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లే సమయంలో తమకు సమాచారం ఇవ్వకుండా వెళ్లొద్దని ఆదేశాలు జారీచేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లోనూ భయాందోళన నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories