ఐటీ గ్రిడ్స్ అశోక్ కు చుక్కెదురు

ఐటీ గ్రిడ్స్ అశోక్ కు చుక్కెదురు
x
Highlights

తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత అశోక్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను తెలంగాణా హై కోర్టు జూన్ 4 వ తేదీకి వాయిదా వేసింది....

తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత అశోక్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను తెలంగాణా హై కోర్టు జూన్ 4 వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ ఆరోపణలను అయన ఎదుర్కుంటున్న విషయం విదితమే. అయితే, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో గతంలో అయన పిటిషన్ వేశారు. దానిని కోర్టు కొట్టేసింది. తరువాత ఈ విష్యం పై అశోక్ హైకోర్టును ఆశ్రయించాడు. కాగా తనపై మాదాపూర్ పోలీసులు పెట్టిన కేసులు కొట్టివేయాలంటూ అశోక్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ధర్మాసనం ఎప్పుడు విచారిస్తుందో ఇంకా స్పష్టత రాలేదు.

ఇదిలా ఉండగా ఈ కేసు విషయంలో పోలీసులు అశోక్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నాలుగు బృందాలుగా విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు నగరాలలో తమ గాలింపు ను కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories