ఈ ఘటనంతటికీ తన భార్యే కారణమన్న మనోహరాచారి

x
Highlights

ప్రేమ పెళ్ళి చేసుకుందని హైదరాబాద్ లో కూతురిపై కత్తితో దాడి చేసిన మనోహరాచారిని కోర్టుకు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు...

ప్రేమ పెళ్ళి చేసుకుందని హైదరాబాద్ లో కూతురిపై కత్తితో దాడి చేసిన మనోహరాచారిని కోర్టుకు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళారు. కూతురిపై పాశవికంగా దాడి చేసిన మనోహరాచారిని రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. కోర్టుకు తరలించే సందర్భంగా మనోహరాచారిని మీడియా చుట్టిముట్టింది. అతనిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే తొందరపడి తప్పు చేశానని మనోహరాచారి అంగీకరించాడు. తన ఉద్దేశం ఎవర్నీ చంపడం కాదనీ..బెదిరించడమేననీ చెప్పుకొచ్చాడు. చావు బతుకుల్లో ఉన్న తన కూతురు మాధవి బతకాలని మనోహరాచారి కోరుకున్నాడు. తాను మాధవి-సందీప్ లపై దాడి చేయడానికి తన భార్యే కారణమని మనోహరాచారి ఆరోపించాడు. అసలు కుమార్తెపై దాడి చేసే బదులు తన భార్యను చంపేసి ఉంటే సరిపోయేదని వ్యాఖ్యానించాడు. మాధవి కోలుకుని ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తాను తొందరపడి తప్పు చేశానని అంగీకరించాడు. తన అల్లుడు చాలా మంచివాడన్నాడు. మాధవి ప్రేమ విషయం ఇంట్లో అందరూ తన దగ్గర దాచిపెట్టారన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories