వైఎస్సార్ బయోపిక్‌పై దర్శకుడు క్లారిటీ

వైఎస్సార్ బయోపిక్‌పై దర్శకుడు క్లారిటీ
x
Highlights

‘ఆనందో బ్రహ్మా’ చిత్ర ద్వారా కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్...

‘ఆనందో బ్రహ్మా’ చిత్ర ద్వారా కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించబోతున్నారని, అలాగే నయనతార మరో కీలక పాత్రలో నటిస్తున్నారని ఇటీవల వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ వార్తలపై స్పందించాడు దర్శకుడు. ఈ సినిమాలో మమ్ముట్టి, నయనతార నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నాడు. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనులు జరుగుతున్నాయని.. ఇంకా నటీనటులను ఎంపిక చేయలేదని ఆయన చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories