‘భరత్ అనే నేను’ ఫస్ట్ రివ్యూ: ‘రంగస్థలం’ కంటే ఎక్కువ రేటింగ్!

‘భరత్ అనే నేను’ ఫస్ట్ రివ్యూ: ‘రంగస్థలం’ కంటే ఎక్కువ రేటింగ్!
x
Highlights

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల...

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ‘భరత్ అనే నేను’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ‘శ్రీమంతుడు’ సినిమాతో మహేష్ కెరియర్‌లోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి.. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ వేసవి కానుకగా ఏప్రిల్ 20 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డి.వి.వి ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.

భారీ అంచనాలతో సుమారు 2000 థియేటర్స్‌లో భారీ విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ ‘బ్లాక్ బస్టర్ హిట్.. మహేష్ బాబు యాక్షన్ అదిపోయింది’ అంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు యూఏఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సాంధూ. గత కొంత కాలంగా యూఏఈ సెన్సార్ సభ్యుడిగా చెప్పుకునే ఉమర్ సింధూ పలు చిత్రాలకు రివ్యూలు ఇచ్చారు. కొన్ని సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయినా..కొన్ని మాత్రం బాక్సాఫీస్ ముందు బోర్లా పడ్డాయి. రీసెంట్ గా సుకుమార్, రామ్ చరణ్, సమంత కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే ఉమేర్ సాంధూ ఈ మధ్యకాలంలో సినిమా విడుదలకు ముందే రివ్యూలను పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రానికి ఈయన 3.5/5 రేటింగ్ ఇవ్వగా.. ‘భరత్ అనే నేను’ చిత్రానికి ఏకంగా 4/5 రేటింగ్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈ లెక్కన ‘రంగస్థలం’ మూవీని మించి ‘భరత్ అనే నేను’ ఉందనేది ఆయన తాజా రివ్యూ సారాంశం.

Show Full Article
Print Article
Next Story
More Stories