రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు : తెలంగాణా సీఎం కేసీఆర్

రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు :  తెలంగాణా సీఎం కేసీఆర్
x
Highlights

రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణాను చూసి యావద్దేశం నేర్చుకుంటోంది అని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ...

రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణాను చూసి యావద్దేశం నేర్చుకుంటోంది అని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మైనార్టీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నమని చెప్పిన కేసీఆర్ త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories