ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
x
Highlights

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ఘటన కలహండి జిల్లా...

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ఘటన కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో జాతీయ రహదారి 26పై బుధవారం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కాగా చనిపోయినవారంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories