చావు గురించి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చివరి మాటలు..
nanireddy24 Sep 2018 1:52 AM GMT
మావోయిస్టుల ఘాతుకానికి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములు బలైపోయారు. నిన్న ఉదయం పది గంటల ప్రాంతంలో 50 మందికి పైగా మావోయిస్టులు అందులో దాదాపు 30 మంది మహిళా మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో వీరిద్దరూ మృతిచెందారు. ఇక కిడారి హత్యకు ముందు ఆయన మాట్లాడిన మాటలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. మన్యంలో ప్రబలిన విషజ్వరాలపై రాజకీయం చేయకుండా వారికీ అండగా నిలవాలని.. వీలైతే వారిని ఆసుపత్రిలో చేర్పించి సాయం అందించాలని కోరారు. అంతేకాదు.. అందరూ ఏదో ఒకరోజు శవమై పోవలసిందేనని.. తనతోపాటు అందరూ సమాధి కావలసిందేనని.. అది కొంత ఎక్కువో తక్కువో ఉండొచ్చు అని అన్నారు. కాగా వీరి మృతిపై సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత వైయస్ జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హత్యలకు తావు లేదని మావోల దుశ్చర్యను ఖండించారు.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT