భారీగా తుఫాను సాయం అందించిన అక్షయ్ కుమార్

భారీగా తుఫాను సాయం అందించిన అక్షయ్ కుమార్
x
Highlights

ఫోని తుఫాను ధాటికి ఒడిశా లోని కొంత ప్రాంతం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. తుఫాను ప్రభావం తగ్గి రెండు రోజులవుతున్నా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా...

ఫోని తుఫాను ధాటికి ఒడిశా లోని కొంత ప్రాంతం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. తుఫాను ప్రభావం తగ్గి రెండు రోజులవుతున్నా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఆహరం, వైద్యం అందిస్తున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా ఆహార పదార్ధాలు ఒడిశాకు వెళ్లాయి. ఇక తుఫాను ప్రభావంతో ఇబ్బంది పడ్డ ఆ రాష్ట్రానికి సహాయం చేయడంకోసం స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముందుకు వచ్చారు.

తుఫాను సహాయార్ధం తనవంతుగా రూ. 1 కోటి రూపాయల విరాళాన్ని ఒడిశా సీఎం సహానిధికి పంపించారు. పలు సమస్యలపై స్పందిస్తూ తన వంతుగా సాయమందించడంలో ముందుండే అక్షయ్‌.. ఒడిశాకుభారీగా విరాళం ఇచ్చారు. గతంలో కేరళ, చెన్నై వరదల సమయంలో కూడా ఆయన భారీగానే విరాళం అందించారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ. 5 కోట్ల విరాళం ఇచ్చి ఓదార్యాన్ని చాటుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories