దేవుడే దిక్కు...ఫలితాలకు ముందు ప్రత్యేక పూజలు

దేవుడే దిక్కు...ఫలితాలకు ముందు ప్రత్యేక పూజలు
x
Highlights

ఓట్ల లెక్కింపుకు మరిన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, పార్టీల నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టెన్షన్ తాళలేక కొందరు, విజయం చేకుర్చాలని...

ఓట్ల లెక్కింపుకు మరిన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, పార్టీల నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టెన్షన్ తాళలేక కొందరు, విజయం చేకుర్చాలని మరికొందరు దేవాలయాల బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో జరుగుతున్న గంగమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు చంద్రబాబు దంపతులు. ఇటు తూర్పు గోదావరి జిల్లా తునిలో తలపులమ్మ అమ్మవారిని మంత్రి గంటా శ్రీనివాస రావు సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలంటూ రాజమండ్రిలో గుడా చైర్మన్ గన్నికృష్ణ ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి సుదర్శన హోమం చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి చినరాజప్ప, ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, అసెంబ్లీ అభ్యర్థులు గోరంట్ల, పెందుర్తి వెంకటేష్, ఆదిరెడ్డి భవానీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని, టీడీపీ అభ్యర్థులంతా విజయం సాధించాలని కోరుకున్నారు. రేపు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో టీడీపీ నేతలు సుదర్శన హోం నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ అంతా బూటకమని, ఏపీలో మరోసారి టీడీపీ విజయం ఖాయం అని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

తిరుమల శ్రీవారిని వైసీపీ మహిళా నేత రోజా దర్శించుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని, జగన్ సీఎం కావాలని స్వామివారిని మొక్కుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడంలో ఎలాంటి సందేహాలు అవసరంలేదన్న రోజా లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలు దొంగ సర్వేలని, ఓ గదిలో కూర్చుని అంకెలేసుకుని వచ్చారని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories