హైదరాబాద్ లో కజాక్ ప్రొఫెసర్ల బృందం పర్యటన..

హైదరాబాద్ లో కజాక్ ప్రొఫెసర్ల బృందం పర్యటన..
x
Highlights

విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్, కజికిస్తాన్ ముందుకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ...

విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్, కజికిస్తాన్ ముందుకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కజికిస్తాన్ ప్రెసిడెంట్ ఫ్రొఫెసర్ అల్హనోవ్, డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పార్టనర్ షిప్ ప్రొఫెసర్ అస్సన్ తో కూడిన ప్రొఫెసర్ల బృందం సోమవారం హైదరాబాద్ లో పర్యటించింది.

వీరితో పాటు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ కజికిస్తాన్ భారత్ అధికార ప్రతినిధి డాక్టర్ బి.వవ్య సునీతరాజ్, నియో సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ బృందం జేఎన్ టీయూ హైదరాబాద్, ఉస్మానియా యూనిర్సిటీల వైస్ చాన్సలర్లను అలాగే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసింది.

ముందుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీహెచ్ లక్ష్మారెడ్డిని కజాక్ ప్రతినిధి బృందం కలిసింది. కజికిస్తాన్ లో మొత్తం 3 వేలమంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యశిస్తుండగా.. ఒక్క తెలంగాణ నుంచే 600 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలో వీరి కలయిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

వీరి మధ్య వైద్య, విద్య ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కజాక్ లోని తెలంగాణ వైద్య విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి.. బృంద సభ్యులకు హామి ఇచ్చారు. అలాగే కజికిస్తాన్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తెలంగాణ విద్యార్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించే ఆలోచనలు కూడా చేస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విషయాల్లో పరస్పరం సహకరించుకునేందుకు కిజికిస్తాన్, తెలంగాణ ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చాయి.

అనంతరం మేయర్ బొంతు రామ్మోహన్ తో చర్చలు జరిపింది కజాక్ ప్రతినిధి బృందం. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కజికిస్తాన్ రాజధాని ’ఆస్తానా‘ నగరంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. దీంతో తెలంగాణ అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని కజాక్ ప్రతినిధి బృందం మేయర్ కు హామి ఇచ్చింది. తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా మేయర్ ను అహ్వానించింది.

అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ ప్రొఫెస్ ఎస్.రామచంద్రం ను కలిశారు బృంద సభ్యులు. ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, మేనేజ్ మెంట్ కోర్సుల్లో కజికిస్తాన్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు.. ఉస్మానియా తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు ప్రఫెసర్ అల్హనోవో వెల్లడించారు. ఇందుకు వీసీ సూత్ర ప్రాయంగా అంగీకరించారు. అలాగే ఫ్యాకల్టీలను కూడా ఎక్సేంజ్ చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష పరిశోధన కేంద్రమైన బైక నోర్ కాస్మోడ్రామ్ లో అధ్యయనం చేసేందుకు ఉస్మానియా అధ్యాపక బృందాన్ని కజికిస్తాన్ ప్రతినిధి బృందం ఆహ్వానించింది.

జేఎన్ టీయూలో వీసీ, ప్రొఫెసర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్స్, డైరెక్టర్లను కలిసింది కజాక్ ప్రొఫెసర్ల బృందం. సాంకేతిక విద్యాకు సంబంధించిన అనేక విషయాలపై వీరు ప్రధానంగా చర్చించారు. సాంకేతిక విద్యారంగంలో తమ యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని బృందం కోరగా.. అందుకు వీసీ వేణుగోపాల్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. అలాగే పరిశోధన రంగంలో ఒకరికొకరు సహకరించుకోవటంతో పాటు, ఫ్యాకల్టీ మార్పును సూత్ర ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories