బొండా ఉమాపై కేసు నమోదు

బొండా ఉమాపై కేసు నమోదు
x
Highlights

విజయవాడ సెంట్రల్‌ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాతో పాటు ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజపై కేసు నమోదయ్యింది. ఈనెల 8న ఎన్నికల ప్రచారంలో పారిశ్రామికవేత్త...

విజయవాడ సెంట్రల్‌ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాతో పాటు ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజపై కేసు నమోదయ్యింది. ఈనెల 8న ఎన్నికల ప్రచారంలో పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ అజిత్‌సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. కోగంటి సత్యం ఫిర్యాదుతో బోండా ఉమాతో పాటు ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజపై అజిత్‌సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైకులో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై దౌర్జన్యానికి దిగారు. కాగా బొండ ఉమా నీ అంతు చూస్తా అంటూ సత్యంపై బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు బొండా ఉమతోపాటు ఆయన కుమారులపై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories