వైఎస్‌ జగన్‌ పేరుతో తప్పుడు ట్వీట్‌

వైఎస్‌ జగన్‌ పేరుతో తప్పుడు ట్వీట్‌
x
Highlights

ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర వివాదం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ యూ నిందించరాదని వైఎస్సార్‌...

ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర వివాదం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ యూ నిందించరాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేసినట్టుగా ఆయన పేరుతో తప్పుడు ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ అయింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం ఆ ట్వీట్ పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపింది. అది పూర్తిగా తప్పుడు ట్వీట్‌ అని, ఈ ట్వీట్‌ను దురుద్దేశంతో రూపొందించి, ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కాగా ప్రస్తుతం జగన్ కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఎల్లుండి ఆయన హైదరాబాద్ కు తిరిగిరానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories