ఆంధ్రప్రదేశ్ లోని బెల్ట్ షాపులు అన్ని మూసి వేయాల్సిందే

ఆంధ్రప్రదేశ్ లోని బెల్ట్ షాపులు అన్ని మూసి వేయాల్సిందే
x
Highlights

వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని బెల్ట్ షాపులు అన్ని మూసి వేయాల్సిందే అని రాష్ట్ర స్పెషల్‌ సీఎస్‌ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. రేపట్నుంచి...

వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని బెల్ట్ షాపులు అన్ని మూసి వేయాల్సిందే అని రాష్ట్ర స్పెషల్‌ సీఎస్‌ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. రేపట్నుంచి కార్యాచరణ్ మొదలు పెట్టాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి ఎక్సయిజ్ శాఖా సన్నద్ధమవుతోంది. ఇందు కోసం జయవాడ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్‌ కమిషనర్‌ ముకేశ్‌ కుమార్‌ మీనా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకూ ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, దీన్ని పూర్తిగా అరికట్టాలంటే గంజాయి సాగులో లేకుండా చూడాల్సిన బాధ్యత అబ్కారీ శాఖపై ఉందన్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ సిబ్బంది అంతా గట్టిగా పనిచేస్తే బెల్టు షాపుల తొలగింపు అసాధ్యం కాదని కమిషనర్‌ ముకేశ్‌ కుమార్‌ మీనా అన్నారు. ప్రతి గ్రామంలోనూ మద్యం బెల్టు షాపుల ఎత్తివేతకు సమావేశాలు నిర్వహించాలని, నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ చేయాలని సూచించారు. బెల్టు షాపుల నియంత్రణ కోసం ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను.. మండలానికి ఎస్సైని బాధ్యులుగా నియమిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించి బెల్టు షాపులు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెల్టు షాపుల నిర్మూలనపై ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బెల్టు షాపుల నియంత్రణలో నూరుశాతం ఫలితాలు సాధించిన సిబ్బందికి రివార్డులు అందజేసి సత్కరిస్తామని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories