హరికృష్ణ మృతదేహంతో ఆస్పత్రి సిబ్బంది సెల్ఫీ

హరికృష్ణ మృతదేహంతో ఆస్పత్రి సిబ్బంది సెల్ఫీ
x
Highlights

సెల్ఫీ పిచ్చి సమాజంలో పడిపోతున్న మానవ విలువలకు అద్దం పడుతోంది. సందర్భంతో పని లేకుండా, మానవత్వం మరిచిపోయి సెల్ఫీల మత్తులో మునిగిపోతున్నారు కొందరు. ఈ...

సెల్ఫీ పిచ్చి సమాజంలో పడిపోతున్న మానవ విలువలకు అద్దం పడుతోంది. సందర్భంతో పని లేకుండా, మానవత్వం మరిచిపోయి సెల్ఫీల మత్తులో మునిగిపోతున్నారు కొందరు. ఈ పిచ్చితోనే కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా, మరికొందరు సెల్ఫీలతో వికృత ఆనందం పొందుతున్నారు. తాజాగా, నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురికావడం, నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో కన్నుమూయడం తెలిసింది. అయితే, ఈ ఘటనలో ఇప్పుడు బయటకు వచ్చిన ఓ సెల్ఫీ ఫోటో సభ్యసమాజానికి సిగ్గు చేటుగా అనిపిస్తోంది. హైదరాబాద్ కామినేని ఆస్పత్రిలో హరికృష్ణ మృతదేహం వద్ద కొందరు ఆస్పత్రి సిబ్బంది మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నారంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ పక్కన హరికృష్ణ చనిపోయారంటూ నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోతే.. ఆస్పత్రిలోని నలుగురు సిబ్బంది మాత్రం.. హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీలు తీసుకున్నారు. అది కూడా ఫొటోలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్పత్రి సిబ్బంది తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. మృతదేహం వద్ద సెల్ఫీలు తీసుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories