లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
x
Highlights

ప్రజల నాడి తెలిసిన వాళ్లే ఎగ్జిట్ పోల్స్‌ చేయాలని, ప్రతి పనికి మాలిన వాళ్లు సర్వేలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత మంత్రి చింతకాయల...

ప్రజల నాడి తెలిసిన వాళ్లే ఎగ్జిట్ పోల్స్‌ చేయాలని, ప్రతి పనికి మాలిన వాళ్లు సర్వేలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈ సర్వేలు ప్రజలకు అవసరం లేదని, రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయన్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఎన్నికల సమయంలో లగడపాటి రాజగోపాల్ సర్వే వల్ల ఐదారు వందల కోట్ల రూపాయలు నష్టపోయారని, పందాలు కట్టినోళ్లు సర్వనాశనం అయిపోయారని చెప్పారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడని విధంగా మహిళలు ఓట్లు వేశారని చెప్పారు అయ్యన్నపాత్రుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories