డేటా చోరీ కేసు కీలుక మలుపు తిరుగుతుందా...బాబు పేల్చబోయే బాంబ్ ఏంటి..?

డేటా చోరీ కేసు కీలుక మలుపు తిరుగుతుందా...బాబు పేల్చబోయే బాంబ్ ఏంటి..?
x
Highlights

డేటా చోరీ కేసు సరికొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేతిలో కీలక సాక్ష్యం ఉందంటూ...

డేటా చోరీ కేసు సరికొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేతిలో కీలక సాక్ష్యం ఉందంటూ బాంబు పేల్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తి వివరాలు చెబుతానని అన్నారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డేటా చోరీ తతంగమంతా వైసీపీ యాక్షన్ ప్లానని అన్నారు. డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని వ్యాఖ్యానించారు.

సాధారణంగా నేరగాళ్లు సాక్ష్యాలన్నీ తుడిచేశామని అనుకుంటారనీ, కానీ ఎక్కడో, ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తుంటారని చంద్రబాబు అన్నారు. డేటా చోరీ వ్యవహారంలో వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందన్నారు. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య చిచు రేపుతున్న డేటా చోరీ అంశంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. చంద్రబాబు వెల్లడించే విషయం ఏమై ఉంటుంది...? డేటా చోరీ వ్యవహారంలో టీడీపీకి దొరికిన కీలక సాక్ష్యం ఏమిటి..? డేటా చోరీలో వైసీపీ హస్తం ఉందా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories