శ్రీనగర్‌లో ఉగ్ర కాల్పులు.. పాక్ ఖైదీ పరారీ

శ్రీనగర్‌లో ఉగ్ర కాల్పులు.. పాక్ ఖైదీ పరారీ
x
Highlights

జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని శ్రీ మహరాజా హరి సింగ్‌ హాస్పిటల్‌లో...పోలీసులే టార్గెట్‌ చేసుకొని కాల్పులకు తెగబడ్డారు....

జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని శ్రీ మహరాజా హరి సింగ్‌ హాస్పిటల్‌లో...పోలీసులే టార్గెట్‌ చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ పోలీస్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయ్. పాకిస్థాన్‌కు చెందిన ఖైదీ నవీద్‌ను చికిత్స నిమిత్తం భద్రతా బలగాలు ఆస్పత్రికి తీసుకువచ్చాయి. ఈ సమయంలో ఆస్పత్రి వద్ద మాటు వేసిన ఉగ్రవాదులు.. పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఖైదీ నవీద్ బలగాల చెర నుంచి తప్పించుకున్నాడు. తక్షణమే ఉగ్రవాదులు కూడా పారిపోయారు. ఉగ్రవాదులు, ఖైదీ నవీద్ కోసం భద్రతాబలగాలు తనిఖీలు చేపట్టాయి. ఆ ప్రాంతంలో బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories