శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలి: వీహెచ్‌

శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలి: వీహెచ్‌
x
Highlights

కల్మషం లేని మనుషుల మధ్య మేకతోలు కప్పుకున్న తోడేలులా మెలిగాడు. అన్నా అని పిలిచిన ఆడపిల్లలపై మృగాడిలా విరుచుకుపడ్డాడు. అభంశుభం తెలియని ముగ్గురు...

కల్మషం లేని మనుషుల మధ్య మేకతోలు కప్పుకున్న తోడేలులా మెలిగాడు. అన్నా అని పిలిచిన ఆడపిల్లలపై మృగాడిలా విరుచుకుపడ్డాడు. అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారంచేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హాజీపూర్ ఘటనపై స్పందించారు. హాజీపూర్‌ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విహెచ్ డిమాండ్ చేశారు. హాజీపూర్ ఘటన వెలుగులోకి వచ్చి దాదాపే రెండునెలలు అవుతున్నా ఇప్పటి వరకు వరకు బాధితకుటుంబాలకు నష్టపరిహారం చెల్లించలేదని ఆయన విమర్శించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. హాజీపూర్ ఘటనపట్ల సీఎం కేసీఆర్‌ బాధపడ్డారని చెప్పిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బాధితులను ఆదుకునేందుకు ఎందుకు ముందుకు రావట్లేదని వీహెచ్‌ ప్రశ్నించారు. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. కాగా ప్రస్తుతం అతడిని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణ చేస్తున్న కొలది మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories