ఐపీఎల్ -12 వేలం జాక్ పాట్ కొట్టిన ఆటగాళ్లు..

ఐపీఎల్ -12 వేలం జాక్ పాట్ కొట్టిన ఆటగాళ్లు..
x
Highlights

ఇవాళ ఐపీఎల్-12 ప్రారంభమైన సందర్బంగా వివిధ ప్రాంఛైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటివరకు జరిగిన వేలం ప్రక్రియలో *వృద్ధిమాన్ సాహా...

ఇవాళ ఐపీఎల్-12 ప్రారంభమైన సందర్బంగా వివిధ ప్రాంఛైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటివరకు జరిగిన వేలం ప్రక్రియలో
*వృద్ధిమాన్ సాహా కోటిన్నరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
*భారత ఆటగాడు హనుమ విహరిని ఢిల్లీ కేపిటల్స్‌ కొనుగోలు చేసింది. అతని కనీస వేలం ధర రూ. 50 లక్షలు ఉండగా ఢిల్లీ కేపిటల్స్‌ 2 కోట్లకు దక్కించుకుంది.
*అక్సర్ పటేల్‌ను ఢిల్లీ కేపిటల్స్‌ రూ.5కోట్లకు సొంతం చేసుకుంది.
*హెన్రిక్స్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.కోటికి కొనుగోలు చేసింది.
* భారత స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మను 1 కోటి 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్ దక్కించుకుంది.
*శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగను ముంబై ఇండియన్స్ 2 కోట్లకు దక్కించుకుంది.
*వరుణ్ ఆరోన్ ను రాజస్థాన్ రాయల్స్ 2 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.
*భారత్ ఆటగాడు మోహిత్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ 5 కోట్లకు దక్కించుకుంది.
*ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను హైదరాబాద్ జట్టు రూ.2.2కోట్లకు దక్కించుకుంది.
*జయదేవ్‌ ఉనాద్కత్‌ రూ. 8.40 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్ని రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.
* భారత ఆటగాడు మహమ్మద్ సమీ 4 కోట్ల 80 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories