కార్తీ చిదంబరం అరెస్ట్

కార్తీ చిదంబరం అరెస్ట్
x
Highlights

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కుమారుడు పీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను...

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కుమారుడు పీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన్ను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన కార్తీ చిదంబరం మామూలు వ్యక్తి కాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విడుదల చేసిన సమ్మన్లపై స్టే విధించలేమని సుప్రీం కోర్టు.. కార్తీకి షాక్ ఇచ్చింది. దీంతో బుధవారం అధికారులు వచ్చీరాగానే ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, కార్తీ చిదంబరం సీఏ ఎస్ భాస్కరన్‌కు సోమవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు 14 రోజులు జుడిషియల్ కస్టడీ విధించింది. ఐఎన్ఎక్స్ మీడియా కోసం విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతులకు సంబంధించి 2007లో విదేశాల నుంచి రూ.305 కోట్లను అక్రమంగా తీసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ, సీబీఐలు కార్తీ చిదంబరంపై కేసులు నమోదు చేశాయి. తాజాగా అరెస్ట్ చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories