హైదరాబాద్‌ చేరుకున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ చేరుకున్న అమిత్‌ షా
x
Highlights

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌ చేరుకోనున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ వేదికగా అమిత్...

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌ చేరుకోనున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ వేదికగా అమిత్ షా ప్రారంభించనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తొలుత అమిత్ షా విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో సమావేశమవుతారు. శంషాబాద్‌లోని గిరిజన మహిళ సోనీ నాయక్‌కు తొలి సభ్యత్వం ఇస్తారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకుంటారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత రాత్రి 7 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు వెళతారు. పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అలాగే తెలంగాణలో బీజేపీ పార్టీని బాగా బలపరిచి.. అదే సమయంలో అధికార టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతూ ఎన్నికల్లో గెలుపు సాధించడానికి ఏం చెయ్యాలో అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories