35 రూపాయలకే పెట్రోల్‌!

35 రూపాయలకే పెట్రోల్‌!
x
Highlights

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాని మోదీ కొంప ముంచుతాయని యోగా గురు రాందేవ్ బాబా సున్నితంగా హెచ్చరించారు. ప్రభుత్వం పన్నుల్లో ఉపశమనం కలిగిస్తే...

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాని మోదీ కొంప ముంచుతాయని యోగా గురు రాందేవ్ బాబా సున్నితంగా హెచ్చరించారు. ప్రభుత్వం పన్నుల్లో ఉపశమనం కలిగిస్తే తాను లీటర్ పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.35 నుంచి రూ.40కే దేశానికి అందిస్తానని చెప్పారు. ఎన్‌డీటీవీ యూత్ కాంక్లేవ్ సదస్సులో మాట్లాడిన బాబా రాందేవ్ సమకాలీన అంశాలపై ఆసక్తికరంగా స్పందించారు. పెరుగుతున్న ధరలపై మోదీ ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేదంటే ఆయనకు కష్టాలు తప్పవని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి, 28 శాతం శ్లాబ్ కింద ఉంచాలని ఆయన సూచించారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా లేనని, రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. తన వెనుక గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరని... అయినా తాను ఇంత స్థాయికి ఎదిగానని చెప్పారు. డబ్బు వెనక తాను ఏ రోజూ వెళ్లలేదని... డబ్బే తన వెనక వస్తుందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories