నేటి నుంచి చంద్రబాబు సమీక్షలు...త్వరలో జరగబోయే...

నేటి నుంచి చంద్రబాబు సమీక్షలు...త్వరలో జరగబోయే...
x
Highlights

నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 22 వరకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు...

నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 22 వరకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేయనున్నారు. పోలింగ్‌ సరళి, కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఈ ఉదయం రాజమండ్రి పార్లమెంట్‌ స్థానంపై సీఎం సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం సీబీఎన్‌ ఆర్మీతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులతో తొలుత ముఖాముఖిగా మాట్లాడనున్నారు. తర్వాత ఒక్కో నియోజకవర్గానికి 50 మంది చొప్పున ఏడు నియోజకవర్గాల నుంచి పిలిపించిన వారితో సీఎం భేటీ కానున్నారు. పోలింగ్‌ సరళి, బూత్‌ల వారీ లెక్కలు, నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పార్టీ నేతలతో చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories