తొలి దశ సార్వత్రిక ఎన్నికలు...దేశవ్యాప్తంగా 91 స్థానాలకు ఓటింగ్‌

తొలి దశ సార్వత్రిక ఎన్నికలు...దేశవ్యాప్తంగా 91 స్థానాలకు ఓటింగ్‌
x
Highlights

కాసేపట్లో తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఏపీ, తెలంగాణతోపాటు 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్‌సభ...

కాసేపట్లో తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఏపీ, తెలంగాణతోపాటు 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ జరగనుంది. తొలి దశలో మొత్తం 1280మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, ఏపీ అసెంబ్లీ బరిలో 2395మంది పోటీ పడుతున్నారు.

ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. ఏపీలో 25, అరుణాచల్‌లో 2, అసోంలో 5, బీహార్‌లో 4, ఛత్తీస్‌గఢ్‌లో 1, జమ్మూకశ్మీర్‌లో 2, మహారాష్ట్రలో 7, మణిపూర్‌‌లో 1, మేఘాలయలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్‌లో 1, ఒడిషాలో 4, సిక్కింలో 1, తెలంగాణలో 17, త్రిపురలో 1, ఉత్తరప్రదేశ్‌లో 8, ఉత్తరాఖండ్‌లో 5, పశ్చిమబెంగాల్‌లో 2, అండమాన్ నికోబార్‌లో 1, లక్షద్వీప్ 1 ఇలా మొదటి దశలో మొత్తం 91 పార్లమెంట్‌ స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. ఇక తొలి దశలో మొత్తం 1280మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, అందులో 1188మంది పురుషులు, 92మంది మహిళలు ఉన్నారు.

తొలి దశలోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 25 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories