'రైతు' సినిమాపై రియాక్ట్ అయిన కృష్ణవంశీ

రైతు సినిమాపై రియాక్ట్ అయిన కృష్ణవంశీ
x
Highlights

పాపులర్ డైరెక్టర్ కృష్ణ వంశీ గత కొంతకాలంగా హిట్ అందించిన దాఖలాలు లేవు. అయిదు సంవత్సరాల్లో 'గోవిందుడు అందరి వాడేలే', 'నక్షత్రం' చిత్రాలను మాత్రమే...

పాపులర్ డైరెక్టర్ కృష్ణ వంశీ గత కొంతకాలంగా హిట్ అందించిన దాఖలాలు లేవు. అయిదు సంవత్సరాల్లో 'గోవిందుడు అందరి వాడేలే', 'నక్షత్రం' చిత్రాలను మాత్రమే తెరకెక్కించాడు కానీ హిట్ మాత్రం నమోదు చేసుకోలేకపోయాడు. గతంలో బాలకృష్ణ తో 'రైతు' అనే సినిమా రూపొందించాలని కృష్ణవంశీ అనుకున్నారు. అందులోని ఒక పాత్రకు అమితాబచ్చన్ ను కూడా సంప్రదించారు కానీ ఆయన ఒప్పుకోలేదు. దాంతో సినిమా ఆపేశారని టాక్. తాజాగా ట్విట్టర్ లో కృష్ణవంశీ 'రైతు' సినిమా పై రియాక్ట్ అయ్యారు.

తాను ఇప్పటికి కూడా ఆ సినిమాను చేసేందుకు సిద్దంగా ఉన్నాను కానీ బాలకృష్ణ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని జవాబిచ్చారు. మరోవైపు అమితాబచ్చన్ ఓకే అంటేనే బాలయ్య కూడా ఒప్పుకునే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇక ఎన్టీఆర్ తో చేసిన 'రాఖీ' సినిమా తనకు సంతృప్తిని ఇచ్చిందని కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ కాదని అన్నారు. తదుపరి సినిమా గురించి స్పందిస్తూ ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అన్నారు కృష్ణవంశీ.

Show Full Article
Print Article
Next Story
More Stories