ప్రజలనాడి తెలిసినవాడిగా చెబుతున్నా.: బొత్స

ప్రజలనాడి తెలిసినవాడిగా చెబుతున్నా.: బొత్స
x
Highlights

ఏపీలో సార్వత్రిక ఎన్నికల దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదేళ్లు నష్టపోయామన్న బాధ ప్రజల్లో కనిపిస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ...

ఏపీలో సార్వత్రిక ఎన్నికల దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదేళ్లు నష్టపోయామన్న బాధ ప్రజల్లో కనిపిస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనుభవం అంటే వయసు పెరిగితే సరిపోదన్నారు. ఏపీలో నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ పని అయిపోయిందని బొత్స విమర్శించారు. ప్రజలనాడి తెలిసినవాడిగా చెబుతున్నా నమ్మకమైన వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భారీ మోజరీటితో విజయం సాధిస్తాడని జోస్యం చెప్పారు. ఏపీలో వైసీపీ జెండా రేపరేపలాడుతుందని అన్నారు. కాగా రాత్రి 8 దాటినా పలుచోట్ల పోలింగ్‌ కొనసాగుతుంది. నిర్ణీత సమయంలోపు క్యూలైన్లో వేచిఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఇంకా పోలింగ్‌ జరుగుతోంది. చీరాల, గాజువాకలో ఓటర్లు ఇంకా బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు 65.96 శాతం పైగా పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories