యామినీ.. నోరు అదుపులో ఉంచుకో..: వైసీపీ నేత

యామినీ.. నోరు అదుపులో ఉంచుకో..: వైసీపీ నేత
x
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే దీనిపై వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు కోనూరు సతీష్‌శర్మ...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే దీనిపై వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు కోనూరు సతీష్‌శర్మ స్పందించారు. గుంటూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత సాధినేని యామిని, వేమూరి ఆనంద్‌ సూర్యలకు లేదని కోనూరు సతీష్‌శర్మ ధ్వజమెత్తారు. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ నోరు అదుపులో ఉంచుకుంటే మంచిదన్నారు. అయితే బ్రాహ్మణ మహిళలను రాజకీయ నాయకులు చాలా గౌరవిస్తారు కాబట్టి పేరులో శర్మ అని తగిలించుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చనుకుంటోందని ఎద్దేవా చేశారు. విమర్శలు హుందాగా ఉండాలి కానీ, బజారు మనుషులు మాట్లాడినట్లు మాట్లాడితే సమాజం హర్షించదన్నారు.చంద్రబాబు మెప్పు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories