జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి కుటుంబానికి జగన్‌ పరామర్శ

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి కుటుంబానికి జగన్‌ పరామర్శ
x
Highlights

ఏపీ ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో...

ఏపీ ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతూ ఈ ఉదయం స్వర్గస్తులయ్యారు. అనారోగ్యంతో మృతిచెందిన జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి జగన్ సానుభూతి తెలిపారు. బషీర్‌బాగ్‌లోని అవంతినగర్‌లో సుభాషణ్‌ రెడ్డి నివాసంలోకి జగన్ మోహన్ రెడ్డి బుధవారం వెళ్లారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, అసదుద్దీన్‌ ఒవైసీ, పలువురు నేతలు జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌కు కేసీఆర్ ఆదేశాలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories