అమ్మఒడి పథకంకి అర్హులు ఎవరంటే ...!

అమ్మఒడి పథకంకి అర్హులు ఎవరంటే ...!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ అమ్మ పధకం ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే .. ఇదే విషయాన్నీ ఆయన ప్రమాణస్వీకారంలో కూడా...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ అమ్మ పధకం ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే .. ఇదే విషయాన్నీ ఆయన ప్రమాణస్వీకారంలో కూడా చెప్పుకొచ్చారు .. అయితే ఈ పధకం ఎవరికి వర్తిస్తుంది అన్న దానిపై క్లారిటీ ఇచ్చేసింది ఏపీ ప్రభుత్వం .. కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, అందులో చదివే పిల్లల తల్లులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారని మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు పంపించే తల్లులకు 'అమ్మ ఒడి' కింద ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ పథకం ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఈ పధకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్టు జగన్ ఇంతకు ముందే తెలిపారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories