వివాహేతర సంబంధం.. వ్యక్తి దారుణ హత్య..

వివాహేతర సంబంధం.. వ్యక్తి దారుణ హత్య..
x
Highlights

పది రోజుల కిందట అదృశ్యమైన వ్యక్తి చివరకు మృతుడిగా మారాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పోల్కంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన...

పది రోజుల కిందట అదృశ్యమైన వ్యక్తి చివరకు మృతుడిగా మారాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పోల్కంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు (22), చెన్నకేశవులు అనే యువకులు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. కొన్నిరోజులుగా ఈ విషయంపై వారి మధ్యగొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం కాస్త శ్రీకాంత్‌ అనే యువకుడికి తెలిసింది. శ్రీకాంత్‌కు సదరు మహిళ పిన్ని కావడంతో మొదట నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతడు తీరు మార్చుకోకపోవడంతో చెన్నకేశవులుతో కలిసి అంతమొందించాలని కుట్ర పన్నాడు. అందులో భాగంగా ఈనెల 9వ తేదీన రాత్రి నాగరాజును గ్రామ సమీపంలోని వాగులోకి తీసుకెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో వివాహేతర సంబంధంపై అతడిని నిలదీశారు.

తనపై ఏదో జరుగుతుందని పసిగట్టిన నాగరాజు వారినుంచి తప్పించుకునేందుకు కళ్లలో ఇసుక చల్లి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినా వెంబడించి వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచి చంపేశారు. అనంతరం తల మొండెంను వేరుచేసి అక్కడే ఉన్న ఇసుకలో రెండు ప్రదేశాల్లో పూడ్చిపెట్టారు. సోమవారం రాత్రి వాగులో అనుమానాస్పదంగా మృతదేహం బయట పడింది. విషయం కాస్త పోలీసుల తెలియడంతో వారు విచారణ మొదలెట్టారు. బయటపడిన మొండెం నుంచి దాదాపు కిలోమీటరు వరకు వెళ్ళిన జాగిలం తల పూడ్చిపెట్టిన ప్రదేశానికి వెళ్లి ఆగింది. ఆ ప్రాంతంలో తవ్వగా మృతుడి తల బయటపడింది. దీన్ని కొన్నిరోజులుగా అదృశ్యమైన నాగరాజుగా స్థానికులు, కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో పోలీసులు విచారణ మరింత వేగవంతం చేసి హత్య చేసింది శ్రీకాంత్, చెన్నకేశవులుగా తేల్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories