పవన్ కల్యాణ్ ఓటమిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ ఓటమిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
x
Highlights

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నాగబాబు ఇటీవలే స్పందించారు. ఇక నాగబాబు లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన...

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నాగబాబు ఇటీవలే స్పందించారు. ఇక నాగబాబు లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండుస్థానాల్లో పోటీచేసినా పరాజయమే చవిచూశారు. తాజాగా పవన్ ఓటమిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ పోటీ చేసిన స్థానాల్లో ఓడించేందుకు కోట్లు ఖర్చు చేశారంటూ నాగబాబు ఆరోపణలు చేశారు.

పవన్ పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోవడం అనేది చాలా దారుణమన్నారు. పవన్‌ను ఓడించడానికి రూ.150 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు చేసి ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. కానీ అంతకంటే ఎక్కువగానే ఖర్చు చేశారని నా అభిప్రాయం అన్నారు నాగబాబు. ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు, అధికార దుర్వినియోగం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం పనిచేసింది అని నాగబాబు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories