ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్‌ హతం

ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్‌ హతం
x
Highlights

నక్సల్స్, ఎస్టీఎఫ్ దళాల మధ్య హోరాహోరీ కాల్పుల్లో నలుగురు నక్సల్స్‌ హతమయ్యారు. ఈ ఘటన ఛతీస్‌గఢ్‌లోని దాంతారి అటవీప్రాంతంలో జరిగింది. స్పెషల్‌ టాస్క్‌...

నక్సల్స్, ఎస్టీఎఫ్ దళాల మధ్య హోరాహోరీ కాల్పుల్లో నలుగురు నక్సల్స్‌ హతమయ్యారు. ఈ ఘటన ఛతీస్‌గఢ్‌లోని దాంతారి అటవీప్రాంతంలో జరిగింది. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీస్‌ సిబ్బంది నక్సల్స్‌ జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నక్సల్స్‌కు పోలీస్‌ సిబ్బందికి మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు నక్సల్స్‌ మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మృతదేహాలు, వారి వద్దనున్న ఏడు తుపాకులను జప్తు చేసుకున్నారు. కాగా ఎస్టీఎఫ్ దళాలు ఇప్పటికీ గాలింపు కొనసాగిస్తున్నట్టు డీఐజీ సుందర రాజ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories