రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.649కే..

రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.649కే..
x
Highlights

ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్-అమెజాన్‌లు వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ బిగ్ డీల్ తో...

ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్-అమెజాన్‌లు వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ బిగ్ డీల్ తో దుమ్మురేపగా.. మరో దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇదే తరహా ఆఫర్ ను ఈ నెల 19 వరకు కొనసాగించనుంది. ఇందులో భాగంగా షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.649కే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అయితే ఈ ఫోన్ కావాలనుకునేవారు... ఎక్స్‌చేంజ్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌చేంజ్‌లో రూ.12,850 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే మరో పదిశాతం రాయితీ లభిస్తుంది. ఫలితంగా ఫోన్‌ రూ.649కే లభించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories