వైరల్ అవుతున్న మోడీ గెటప్

వైరల్ అవుతున్న మోడీ గెటప్
x
Highlights

పొడవాటి జుబ్బా తలకు టోపీ నడుముకు ఎర్రటి బట్ట ఎడమ భుజంపై శాలువా మెడలో రుద్రాక్ష కేదార్‌నాథ్‌లో మోడీ గెటప్ ప్రస్తుతం వైరల్ గా మారింది రెండు రోజుల తీర్ధ...

పొడవాటి జుబ్బా తలకు టోపీ నడుముకు ఎర్రటి బట్ట ఎడమ భుజంపై శాలువా మెడలో రుద్రాక్ష కేదార్‌నాథ్‌లో మోడీ గెటప్ ప్రస్తుతం వైరల్ గా మారింది రెండు రోజుల తీర్ధ యాత్రల్లో భాగంగా మోడీ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చార్‌ధామ్‌ యాత్రల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించుకున్నారు. ఈ ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న మోడీ అక్కడి నుంచి కేదార్‌నాథ్‌ వెళ్లారు. కేదారీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మోడీ రాక నేపథ్యంలో ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

రెండు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న మోడీ ఆదివారం బద్రీనాథ్‌ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మోడీ గతంలో నాలుగుసార్లు దర్శించుకున్నారు. గతేడాది నవంబరు నెలలో దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు 2017లో రెండు సార్లు కేదార్‌నాథ్‌కు వచ్చారు.

చివరి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు మోడీ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకోవడం ఆసక్తిగా మారింది. ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలోనూ ఎన్నిక జరగనుంది. కేదార్ నాథ్ యాత్ర సందర్భంగా మోడీ ధరించిన వస్త్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. పొడవాటి జుబ్బాతో పాటు ఓ రకమైన టోపిని ధరించారు. నడుముకు ఎర్రటి బట్ట కట్టుకున్నారు. ఎడమవైపు భుజంపై వైపు శాలువా కూడా వేసుకున్నారు. మెడలో రుద్రాక్ష కూడా ధరించారు మోడీ. దీంతో ఆయన వేసుకున్న ప్రత్యేక వస్త్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories