మహారాష్ట్ర సోలాపూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం

మహారాష్ట్ర సోలాపూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం
x
Highlights

మహారాష్ట్ర సోలాపూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగిఉన్న లారీని తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు ఢీకొట్టడంతో.. బస్సులో ఒక్కసారిగా మంటలు...

మహారాష్ట్ర సోలాపూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగిఉన్న లారీని తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు ఢీకొట్టడంతో.. బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సోలాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పండపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు.. సోలాపూర్, పూణె జాతీయరహదారిపై ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సుతో పాటు లారీ కూడా పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, పలువురి తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories