ఏపీ ఎంపీల ఆందోళనలపై స్పందించిన జైట్లీ

ఏపీ ఎంపీల ఆందోళనలపై స్పందించిన జైట్లీ
x
Highlights

ఏపీకి ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీల ఆందోళనకు స్పందించిన జైట్లీ ఏపీకి...

ఏపీకి ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీల ఆందోళనకు స్పందించిన జైట్లీ ఏపీకి నిధుల కేటాయింపుపై ప్రకటన చేశారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులను వివిధ మార్గాల ద్వారా సమకూర్చుతున్నామని తెలిపారు. హోదా ఇవ్వలేని పరిస్థితుల్లోనే ప్యాకేజీ ఇస్తున్నామని జైట్లీ ప్రకటించారు. హోదా ఉంటే 90 శాతం నిధులు కేంద్రం అందిస్తుందని, అదే, ప్యాకేజీ రూపంలో తామూ 60 శాతం నిధులు ఇస్తున్నామని తెలిపారు. మిగిలిన నిధులను కూడా విదేశీ పెట్టుబడుల రూపంలో ఏపీకి సాయం చేస్తున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories