తుంగతుర్తిలో టీఆరెస్, ఉత్తమ్ సతీమణి ఓటమి.. తుది ఫలితాలు ఇవే..

తుంగతుర్తిలో టీఆరెస్, ఉత్తమ్ సతీమణి ఓటమి.. తుది ఫలితాలు ఇవే..
x
Highlights

తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై 17 వందల ఓట్ల పైచిలుకు ఓట్లతో కిషోర్ గెలుపొందారు. ఈవీఎం...

తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై 17 వందల ఓట్ల పైచిలుకు ఓట్లతో కిషోర్ గెలుపొందారు. ఈవీఎం మొరాయించడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా జరిగింది. అలాగే కోదాడ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భార్య పద్మావతి ఓటమి చెందారు. పద్మావతిపై బొల్లం మల్లయ్య యాదవ్‌ గెలుపొందారు. ఇక మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. టీఆరెస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి పై ఆమె 4 వేల ఓట్ల మెజారితో గెలుపొందారు. ఇక ఇబ్రహీం పట్టణంలో ఆఖరినిమిషంలో ఫలితం మారిపోయింది. ఇక్కడ టీఆరెస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్వల్ప ఓట్ల మెజారితో గెలుపొందారు. మొదటినుంచి బీఎస్పీ అభ్యర్థి మలిరెడ్డి రంగారెడ్డి, తెరాస అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య ఫలితం దోబూచులాడింది. మొత్తంగా టీఆరెస్ కు 88 , ప్రజాకూటమికి 21, బీజేపీ 1 ,ఎంఐఎం 7 ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు

Show Full Article
Print Article
Next Story
More Stories