భార్య కాపురానికి రావడం లేదంటూ దారుణం....
arun6 Aug 2018 5:15 AM GMT
ఓ కసాయి తండ్రి కర్కశత్వానికి అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు బలయ్యారు.
హాయిగా అమ్మ ఒడిలో నిద్రపోవాల్సిన పదినెలల పసికందుతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు చిత్తూరు జిల్లా నీవా నదిలో శవాలై తేలారు. గంగాధర నెల్లూరు మండలం బాలవెంగనపల్లెకు చెందిన వెంకటేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. భార్య కాపురానికి రావడం లేదనే ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్య అమరతో వెంకటేష్ గొడవపడ్డాడు. క్షణిక ఆవేశంలో ఇంట్లో నిద్రిస్తున్న పది నెలల బాబు పునీత్, సంజయ్ , రాహుల్ ను స్వగ్రామానికి తీసుకొచ్చాడు. చిన్న పిల్లలు అనే దయ కూడా లేకుండా ముగ్గురు కుమారులను నీవా నదిలో పడేశాడు. కాసేపటికి చిన్నారుల శవాలు నీటిలో తేలాయి. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఘటనస్థలికి వచ్చారు. మృతదేహాలను వెలికితీశారు. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT