డ్రగ్స్ ఓవర్ డోస్.. యువకుడు మృతి

డ్రగ్స్ ఓవర్ డోస్.. యువకుడు మృతి
x
Highlights

డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో పండు అనే యువకుడు చనిపోయాడు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లికి చెందిన శివకుమార్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో...

డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో పండు అనే యువకుడు చనిపోయాడు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లికి చెందిన శివకుమార్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడు పండు(19) కొత్తపేటలోని ఓ ప్రయివేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం మద్యలోనే ఆపేసాడు. దీంతో తన తండ్రి (శివకుమార్‌)కు చెందిన వాటర్ ప్లాంట్‌లోనే పనిచేస్తున్నాడు పండు. అయితే ఈ క్రమంలోనే పండు గంజాయి, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. వాటర్ ప్లాంట్‌లో విధులు ముగించుకొని దారి మద్యలో డ్రగ్స్ కొట్టి ఇంటికి వెళ్తుండే వాడు. అయితే శుక్రవారం సాయంత్రం పెద్ద మొత్తంలో డ్రగ్స్ మాత్రలు తీసుకున్న పండును గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డ్రగ్స్ మాత్రలు మింగాడని గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ పండు మృతి చెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండు మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories