పెళ్లి పత్రికలను పంచబోతూ తిరిగిరాని లోకాలకి వెళ్ళింది ..

పెళ్లి పత్రికలను పంచబోతూ తిరిగిరాని లోకాలకి వెళ్ళింది ..
x
Highlights

నిచ్చితార్ధం అయింది .. మరో పది రోజుల్లో పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఎన్నో ఆశలు .. ఇంతలోని విషాదం చోటు చేసుకుంది .. తన స్నేహితులకు...

నిచ్చితార్ధం అయింది .. మరో పది రోజుల్లో పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఎన్నో ఆశలు .. ఇంతలోని విషాదం చోటు చేసుకుంది .. తన స్నేహితులకు స్వయంగా పత్రిక ఇద్దామని వెళ్ళిన ఆమెని ఓ లారీ గుద్దడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.. త్వరలో పెళ్లి బాజాలు వినిపించావాల్సిన ఈ ఇంట్లో కన్నీటి రోదనలు వినిపిస్తున్నాయి .. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది . సూల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన పద్మ తిరుపతి దంపతులకు హారిక అనే కుమార్తె ఉంది . అయితే ఆమెకి ఈ నెల 26 న పెళ్లి నిశ్చయమైంది. తన పెళ్లి పత్రికలను పంచేందుకు హారిక తన సోదరుడితో కలిసి వెళ్లింది. వారి బైక్ ఓదెల మండలం కొలనూరు వెళ్లి తిరిగివస్తోండగా ప్రమాదానికి గురయ్యారు. రేగడమద్దికుంట శివారులో వెనుక నంచి వచ్చన లారీ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలతో హరిక అక్కడికక్కడే మృతిచెందింది. కిరణ్‌కు గాయాలు కావడంతో దగ్గరిలోని ఆస్పత్రిలో చేర్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories