శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ అరెస్ట్

శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ అరెస్ట్
x
Highlights

శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రదీప్‌కుమార్‌తో పాటు ఆయన కుమారుడు సాయి చరణ్‌ను కూడా డీఆర్‌ఐ అధికారులు...

శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రదీప్‌కుమార్‌తో పాటు ఆయన కుమారుడు సాయి చరణ్‌ను కూడా డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేసి ట్యాక్స్‌ ఎగ్గొట్టిన ఆరోపణలపై ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. కస్టమ్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 135 ప్రకారం ప్రదీప్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ముఖ్యంగా ముడిసరుకు అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం, అమ్మకాలు జరపడం, వాటిపై పన్ను ఎగ్గొట్టడం వంటి నేరాలపై కేసులు పెట్టారు. హైదరాబాద్‌ తో పాటు దేశవ్యాప్తంగా 35 కంపెనీలను మెయింటేన్‌ చేస్తున్న ప్రదీప్‌కుమార్‌ పలు రాష్ట్రాల్లో బంగారం వ్యాపారం చేస్తున్నారు. దుబాయ్‌, అమెరికా వంటి దేశాల్లో కూడా గోల్డ్‌ బిజినెస్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories